-

ఇంకా చాలా ఉంది

23 Dec, 2018 02:51 IST|Sakshi
సుమంత్‌ అశ్విన్,నందితా శ్వేత

సుమంత్‌ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నందితా శ్వేత కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్‌ 2’. ‘బ్యాక్‌ టు ఫియర్‌’ అనేది ఉపశీర్షిక. సుదర్శన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో హరి కిషన్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. 2013లో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌ అన్నది తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. టీజర్‌ను విడుదల చేశారు. సినిమాను జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథా చిత్రమ్‌’  ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. సీక్వెల్‌ కూడా అంతటి ఘనవిజయం సాధిస్తుందని టీజర్‌ని చూసిన వారు చెబుతుంటే హ్యాపీగా ఉంది. సుమంత్, సిద్ధి ఇద్నాని ప్లెజంట్‌గా నటిస్తే నందితా శ్వేత నటనలో తన విశ్వరూపం చూపించారు. ప్రేక్షకులు చూసింది టీజర్‌ మాత్రమే.. సినిమాలో ఇంకా చాలా ఉంది’’ అని అన్నారు. కృష్ణతేజ, ప్రభాస్‌ శ్రీను, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు జేబీ సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు