వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమంటేనే చిత్రం

28 Oct, 2013 00:32 IST|Sakshi
వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమంటేనే చిత్రం
మానస్, ఆరుషి జంటగా గునపాటి సురేష్‌రెడ్డి సమర్పణలో గంగవరపు శ్రీనివాసులునాయుడు, జీవీ నరసయ్య, కృత్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమంటేనే చిత్రం’. వి.ఆర్. దొరైరాజు దర్శకుడు. ఈ చిత్రం పాటలను ఆదివారం పాత్రికేయులకు ప్రదర్శించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘దేశంలోని కొన్ని పట్టణాల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశాం. ప్రేమ, వినోదం, సందేహం సమాహారంతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. 
 
నవంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని  నిర్మాత శ్రీనివాసులు నాయుడు చెప్పారు. పాటలు విజయం సాధించినట్లుగానే సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నరసయ్య తెలిపారు.  మంచి పాత్ర చేశానని ఆరుషి చెప్పారు. ఈ చిత్రంలో దర్శకుడు మంచి పాత్ర ఇచ్చారని, మంచి సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు మిగులుతుందని  మానస్ అన్నారు.
>