ఈ 22న రామానాయుడు సంస్మరణ సభ

18 Mar, 2015 22:17 IST|Sakshi
ఈ 22న రామానాయుడు సంస్మరణ సభ

హైదరాబాద్ సిటీ: టాలీవుడ్ ప్రముఖ  సినీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు సంస్మరణ సభను ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ సభకు లలితా కళా పరిషత్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఈ సంస్మరణ సభలో పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.