ఆ సినిమాను పంజాబ్ లో నిషేధించారు

24 Apr, 2016 12:48 IST|Sakshi
ఆ సినిమాను పంజాబ్ లో నిషేధించారు
చండీగఢ్: ఇటీవల విడుదలైన 'శాంటా బాంటా ప్రైవేట్ లిమిటెడ్' హిందీ సినిమాపై పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించింది. సిక్కులను తక్కువగా చూపిస్తూ  కొన్ని సన్నివేశాలు ఉన్నట్లు ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజింగ్ కమిటీ అధ్యక్షడు  జీకే మంజిత్ సింగ్ డిప్యూటీ సీఎం సుఖ్ విర్ సింగ్ బాదల్ తో సమావేశమై సినిమాపై చర్చించారు. అనంతరం బాదల్ రాష్ట్రంలో సినిమాను నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.  వీర్ దాస్, బొమన్ ఇరానీ, నేహా ధూపియా, లిసా హేడన్ ముఖ్యపాత్రల్లో నటించిన 'శాంటా బాంటా ప్రైవేట్ లిమిటెడ్'  ఈనెల 22 విడుదైన విషయం తెలిసిందే.