టాలీవుడ్‌కు జాన్వీ.. హీరో ఎవరంటే!

17 Aug, 2019 15:18 IST|Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన భామ జాన్వీ కపూర్‌. తొలి సినిమా ధడక్‌తోనే నటిగా మంచి మార్కులు సాధించిన ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్‌కు పరిచయం కానుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ బ్యూటీని టాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసుకున్నారట.

ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్‌ హిట్ అందుకున్న పూరి, తదుపరి చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలోనే జాన్వీ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. గతంలో జాన్వీ, సౌత్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే తనకు ఇష్టమని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో విజయ్‌తో నటించేందుకు జాన్వీ ఓకె చెప్పే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై పూరి టీం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీపై సౌత్‌ లో గట్టిగానే చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు