‘‘నాది రాజస్థాన్. కెరీర్ ప్రారంభంలో కొన్ని వెబ్ సిరీస్ చేశాను. తెలుగులో నా రెండో సినిమా ‘రాహు’. ఇందులో భాను పాత్ర చేశాను. భాను లాంటి పాత్రలు ఏ హీరోయిన్ కెరీర్లో అయినా అరుదుగా వస్తాయి. కెరీర్ బిగినింగ్లో నేను ఇలాంటి పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తెస్తుందని బలంగా నమ్ముతున్నా’’ అని కృతి గార్గ్ అన్నారు. అభిరామ్ వర్మ, కృతి గార్గ్ జంటగా సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాహు’. ఏవీఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా కృతి గార్గ్ మాట్లాడుతూ– ‘‘సుబ్బుగారు ఆడిష¯Œ ్స ద్వారా నన్ను ఎంపిక చేసుకున్నారు. ‘రాహు’ కథ నా చుట్టూ తిరుగుతుంది. నా పాత్రకు కన్వర్షన్ డిజార్డర్ అనే వ్యాధి ఉంటుంది. రక్తం చూస్తే కళ్లు కనిపించవు. చిన్నప్పుడు తల్లిని కోల్పోయిన అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది? అనే అంశాన్ని సుబ్బుగారు బాగా తెరకెక్కించారు. ‘రాహు’ జ్ఞాపకాలు ప్రేక్షకుల్ని కొంత కాలం వెంటాడతాయి. కథ, కథనాల మేరకు గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధమే. ‘రాహు’ సినిమాలో పాత్ర పరిధి మేరకు గ్లామర్ సీ¯Œ ్సలో కనిపిస్తాను. విజయశాంతిగారు మా సినిమా విజయవంతం కావాలని ట్వీట్ చేయడం మాకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అన్నారు.