బిగ్‌బాస్‌ అబద్ధం చెపుతున్నాడు..!

13 May, 2018 13:16 IST|Sakshi

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సౌత్‌లో కూడా ఘనవిజయం సాధించింది. తమిళనాట లోక నాయకుడు కమల్‌ హాసన్‌ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో మరింత క్రేజ్‌ ఏర్పడింది. తొలి సీజన్‌కు మంచి ఆదరణ లభించినందున త్వరలోనే మరో సీజన్‌ను స్టార్ట్ చేసేందుకు బిగ్‌బాస్‌ యూనిట్ రెడీ అవుతోంది.

రెండో సీజన్‌కు కూడా కమల్‌ హాసనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల ఈ సీజన్‌లో పాల్గొనబోయే వారు వీరే అంటూ వికటన్‌ సోషల్‌ మీడియా పేజ్‌లో కొంత మంది సెలబ్రిటీ ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఈ లిస్ట్‌లో జననీ, నందితా, భరత్‌, అశోక్‌ సెల్వన్‌, ప్రియా ఆనంద్‌ వంటి వారితో పాటు రాయ్‌ లక్ష్మీకూడా షోలో పాల్గొననుందని వెల్లడించారు.

ఈ వార్తలపై స్పందించిన రాయ్‌ లక్ష్మీతాను బిగ్‌ బాస్‌లో పాల్గొనబోవటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై తన సోషల్‌ మీడియా పేజ్‌ స్పందించిన ఆమె ‘బిగ్‌బాస్‌ తమిళ్ ఎందుకు నా గురించి ప్రతీ సీజన్‌లో తప్పుడు వార్తలు సృష్టిస్తోంది..? ఎందుకు..?’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు