పాకిస్తాన్‌కు రాజమౌళి

28 Mar, 2018 11:51 IST|Sakshi

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇతర దేశాల్లోనూ రిలీజ్‌ అయి మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇటీవల జపాన్‌ రిలీజ్‌ లోనూ సత్తా చాటిన ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి.

త‍్వరలో పాకిస్తాన్‌లోని కరాచీ జరగనున్న ‘పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌’లో రాజమౌళి పాల్గొనున్నారు. ‘బాహుబలి సినిమా నాకు ఎన్నో దేశాలను సందర్శించే అవకాశం కలిగించింది. వాటన్నింటికి మించి ఇప్పుడు పాకిస్తాన్‌ వెళ్లబోతున్నాం. కరాచీలో జరిగే పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్‌ చేశారు రాజమౌళి.

మరిన్ని వార్తలు