ఫారిన్‌ టూర్‌పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

4 Jul, 2019 11:15 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో ఉన్న దర్శకుడు రాజమౌళి వాషింగ్టన్‌కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ తానా సభలు జరుగుతుండటంతో రాజమౌళి ఆ సభలలో పాల్గొనేందుకు వాషింగ్టన్‌ వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో రాజమౌళి తన టూర్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘నేను కేవలం వ్యక్తిగత పనుల మీద మాత్రమే వాషింగ్టన్‌ వచ్చాను. తానా సభల కోసం కాదు. పెద్దన్న (సంగీత దర్శకుడు కీరవాణి) మ్యూజికల్‌ షోలో కూడా నేను పాల్గొనటం లేదు. అభిమానులు నేను వేడుకలకు హాజరవుతానని ఆశించి నిరాశచెందవద్దు. అందుకే ఈ క్లారిటీ ఇస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

బాహుబలి తరువాత రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా భారీ మల్టీస్టారర్‌ ఆర్ఆర్‌ఆర్‌ను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2020లో రిలీజ్ కానుంది. ఇద్దరు హీరోలు గాయపడటంతో షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన రాజమౌళి, ఇటీవలే తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు.


మరిన్ని వార్తలు