సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో 2.ఓ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘రోబో’ మూవీకి సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ను... వినాయక చవితి సందర్భంగా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబరు 13న విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్తో టీజర్ దూసుకుపోతోంది. తెలుగులో 5,069,230 , తమిళ్లో 9,341,840, హిందీ 10,231,367 వ్యూస్ సాధించింది. దీంతో ‘చిట్టి’ మరోసారి మాయ చేయబోతున్నాడంటూ... టీజర్తోనే అదరగొట్టి అంచనాలు పెంచేస్తున్నాడంటూ తలైవా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో సుమారు 500 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్షన్ ఖిలాడి అక్షయ్కుమార్ రజనీకి ధీటైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. అబ్బురపరిచే గ్రాఫిక్స్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్తో విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్లో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.