రజనీ ‘పేట్టా’ ఆడియో వస్తోంది!

23 Nov, 2018 21:23 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘2.ఓ’తో ఇంకొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల ముందకు రానున్నాడు. శంకర్‌ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక దీని తరువాత రజనీ తదుపరి సినిమాను కూడా లైన్లో పెట్టేస్తున్నాడు.

పిజ్జా ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ డైరెక్షన్‌లో రాబోతోన్న ‘పేట్టా’ చిత్రం ఆడియో రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు మేకర్స్‌. డిసెంబ ర్‌ 9న పాటలను విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. సిమ్రాన్‌, త్రిష కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 

మరిన్ని వార్తలు