తీపి కబురు

26 Dec, 2018 01:50 IST|Sakshi

అభిమానులకు తీపి కబురు చెప్పారు రజనీకాంత్‌. తన తాజా చిత్రం ‘పేట్టా’ ట్రైలర్‌ రిలీజ్‌ తేదీని అధికారికంగా ప్రకటించారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘పేట్టా’. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. తెలుగులో ‘పేట’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇందులో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించారు. విజయ్‌ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, బాబీ సింహా, మాళవికా మోహనన్‌ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి అనిరు«ద్‌ రవిచంద్రన్‌ స్వరకర్త.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్, ఆడియోను ఆల్రెడీ రిలీజ్‌ చేసిన చిత్రబృందం ఈ నెల 28న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ‘పేట్టా’ సినిమా సెన్సార్‌ పూర్తయింది. ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 51 నిమిషాలని కోలీవుడ్‌ టాక్‌. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జనవరి 10న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందట. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత వల్లభనేని అశోక్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు