సూర్య, నయనతార, ప్రణీత నాయకా నాయికలుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మాస్’. ఈ చిత్రాన్ని ‘రాక్షసుడు’ పేరుతో కృష్ణారె డ్డి, రవీందర్రెడ్డి తెలుగులోకి విడుదల చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం విజయోత్సవంలో సూర్య మాట్లాడుతూ- ‘‘ఇందులో హీరోగా నటించానని చెప్పడం కంటే క్యారెక్టర్ చేశానని చెప్పచ్చు. ఆత్మలకు సంబంధించిన మూవీ అయినా చిన్నపిల్లలకు కూడా నచ్చేలా వెంకట్ ప్రభు తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రం అన్ని వర్గాలవారికీ నచ్చుతోంది’’ అని చెప్పారు. ‘‘మనిషి చనిపోయిన తర్వాత ఉండే లైఫ్ను ఈ సినిమాలో చూపించాం’’ అని దర్శకుడు అన్నారు. రచయిత కన్నన్, చిత్ర నిర్మాతలు కృష్ణారెడ్డి , రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.