మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా రకుల్‌!

15 Feb, 2019 09:14 IST|Sakshi

సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. రీసెంట్‌గా కవచం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ అది ఆశించినంత విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఈ యువ హీరో ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇదే కాకుండా ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో ఓ మూవీకి ఓకే చెప్పాడు. 

ఈ రెండు చిత్రాలే కాకుండా  మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెట్టాడు ఈ యంగ్‌ హీరో. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ రాక్షసన్‌ రీమేక్‌లో ఈ హీరో నటించబోతోన్నాడు. వీర ఫేమ్‌ రమేష్‌ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ను హీరోయిన్‌గా తీసుకోబోతోన్నట్లు తెలుస్తోంది. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచీ.. టాప్‌ హీరోయిన్లతోనే జత కడుతున్న ఈ కుర్ర హీరో మరో సారి.. రకుల్‌తో జోడీ కట్టనున్నాడని సమాచారం. మరి తమిళంలో హిట్‌ కొట్టిన మూవీ.. తెలుగులో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. గతంలో ఈ జోడీ ‘జయ జానకి నాయక’ అంటూ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు