నేనొచ్చేశా!

13 Aug, 2019 00:32 IST|Sakshi
రకుల్‌ ప్రీత్‌సింగ్‌

శంకర్‌ తన సినిమాలతో ఓ ప్రపంచాన్నే సృష్టిస్తుంటారు. ఇప్పుడు ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. ఇండియన్‌(తెలుగులో ‘భారతీయుడు)కి ఇది సీక్వెల్‌. కాజల్‌ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్‌ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో సోమవారం జాయిన్‌ అయ్యారు రకుల్‌. ఇందులో సిద్ధార్థ్‌కు జోడీగా ఆమె నటిస్తున్నారని తెలిసింది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021లో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు