అవి హీరోయిన్లను బాధించవు

30 Oct, 2015 08:13 IST|Sakshi
అవి హీరోయిన్లను బాధించవు

చెన్నై : ప్రస్తుతం టాలీవుడ్‌లో నటి రకుల్‌ప్రీత్ సింగ్ క్రేజ్ సహ నటీమణులకు సెగలు పుట్టిస్తోందంటే నమ్మండి. కుర్రకారు కథా నాయకులందరూ ఇప్పుడు ఈ అమ్మడినే కోరుకుంటున్నారు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్‌టీఆర్‌లతో జత కడుతున్న రకుల్‌ప్రీత్  తన పారితోషికాన్ని అమాంతంగా పెంచేసిందనే ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ పక్కన పెట్టిన రకుల్‌ప్రీత్‌ని టాలీవుడ్ అందలం ఎక్కించేస్తోంది. దీంతో యమజోష్‌లో ఉన్న ఈ బ్యూటీ గ్లామర్ విషయంలో హద్దులు దాటేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవి ఈ అమ్మడి చెవిని తాకడంతో ఏ విధంగా స్పందించిందో చూడండి.

‘గ్లామర్‌కు అశ్లీలానికి చిన్న గీత మాత్రమే ఉంటుంది. దాన్ని నేనెప్పెడూ దాటే సాహసం చేయను. ఇక నా కొత్త అందాల గురించి మాట్లాడుతున్నారు. ఈ అందం కోసం ఒక ప్రముఖ శిక్షకుడి వద్ద ప్రత్యేక శిక్షణ పొందాను. నాలోని కొత్త అందాలకు కారణం ఇదే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే మంచి జోరు మీద ఉన్న ఈ బ్యూటీకి రామ్‌చరణ్‌తో నటించిన బ్రూస్‌లీ చిత్రం బ్రేక్ వేసిందనే ప్రచారం పెద్ద షాక్‌నే ఇచ్చిందట. అయినా దాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తూ  జయాపజయాలు హీరోయిన్లను బాధించవు అంటూ మేకపోతు గంభీరాన్ని ఒలకపోస్తూ హీరోయిన్‌గా నా పయనం కొనసాగుతుందని అంటోంది.