సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మురుగదాస్ మార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ అయితే బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందని భావించిన యూనిట్ సభ్యులు చాలా మంది బాలీవుడ్ భామలను సంప్రదించారు. ఒక దశలో పరిణితి చోప్రా ఫైనల్ అయ్యిందన్న వార్త కూడా వినిపించింది. అయితే ఈ బ్యూటి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో మురుగదాస్ టీం వెనక్కు తగ్గారు.
ఫైనల్గా టాలీవుడ్ నయా సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్కు ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని మురుగదాస్ అఫీషియల్గా కన్ఫామ్ చేశారు. ఇంతటి భారీ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చినందుకు రకుల్ దర్శకుడు మురుగదాస్, హీరో మహేష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపింది.
@Rakulpreet plays the leading lady in my next with @urstrulyMahesh :)
— A.R.Murugadoss (@ARMurugadoss) 14 July 2016
@ARMurugadoss @urstrulyMahesh Thanku so much sir. Such a privilege to be working with you and mahesh sir