అవును గాయపడ్డాను: హీరోయిన్

7 Jun, 2016 18:49 IST|Sakshi
అవును గాయపడ్డాను: హీరోయిన్

హైదరాబాద్‌: తనకు గాయమైన మాట వాస్తమేనని టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని ఆమె వెల్లడించింది. అమెరికాలో రకుల్‌ప్రీత్‌ కాలికి గాయమైందని.. దీంతో ఇండియా ట్రిప్ వాయిదా వేసుకున్నారని, సైమా అవార్డు వేడుకలకు ఆమె హాజరుకారని అంతకుముందు వార్తలు వచ్చాయి. యూఎస్ నుంచి భారత్ కు తిరిగివచ్చిన ఆమె సైమా వేడుకల్లో పాల్గొన్నారు.

తాను కోలుకున్నానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'నేను గాయపడినట్టు వచ్చిన వార్తలు నిజమే. మెడకు, భుజానికి గాయాలయ్యాయి. కాలికి కాదు. ఇప్పుడు నేను చాలావరకు కోలుకున్నా. మళ్లీ షూటింగ్ లకు వెళుతున్నా'నని రకుల్ప్రీత్ ట్విట్ చేసింది. తన గాయంపై ఆమె వివరణతో నిర్మాతలు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.