మెగా పవర్స్టార్ రామ్చరణ్ , యంగ్టైగర్ ఎన్టీఆర్లు ప్రస్తుతం జైపూర్లో ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ వివాహం డిసెంబర్ 30న అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరుకానున్నారు. జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్తో కార్తికేయ వివాహం జరుగనుంది.
ఈ వేడుకు హాజరయ్యేందుకు పయణమైన చెర్రీ, ఎన్టీఆర్లు ఎయిర్పోర్ట్లో కెమెరా కంటికి చిక్కారు. ఈ పిక్లో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ చరణ్ చేతిని పట్టుకుని ఉన్నాడు. వీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. రానా, నానిలతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకులకు హాజరుకానున్నారు.