‘స్వీటెస్ట్‌ మ్యాంగోస్‌ ఫ్రం స్వీటెస్ట్‌ కపుల్‌’

15 Jun, 2018 16:41 IST|Sakshi

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన వివాహబంధంతో ఒక్కటై గురువారం(జూన్‌ 14) నాటికి ఆరేళ్ళు అయింది. తమ పెళ్ళి రోజు సందర్భంగా రామ్‌ చరణ్‌తో ఉన్న ఫొటోలను ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ రొమాంటిక్‌ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా తమ తోటలో పండిన మ్యాంగోస్‌ను కొంతమంది సన్నిహితులకు చెర్రీ దంపతులు పంపించారు. నిర్మాత డీవీవీ దానయ్యకు కూడా మామిడి పండ్ల బుట్టను ఈ దంపతులు పంపించారు.

చెర్రీ దంపతులు పంపించిన మామిడి పండ్ల బుట్టను డీవీవీ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘స్వీటెస్ట్‌ మ్యాంగోస్‌ ఫ్రం స్వీటెస్ట్‌ కపుల్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన కొణిదెల. థ్యాంక్యూ సో మచ్‌. ఇద్దిరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు’ తెలిపారు. గతంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ‘బ్రూస్‌లీ’, ‘నాయక్’ చిత్రాలను కూడా డీవీవీ దానయ్య నిర్మించారు.

>
మరిన్ని వార్తలు