సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో హల్చల్ చేస్తున్నారు. ఇటీవల తిరుమల వేదికగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించిన వర్మ సినీ రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఈ సినిమా సందర్భంగా మీడియాకు వరుస ఇంటర్య్వూలు ఇస్తూ సినిమాకు వీలైనంత ప్రచారం తీసుకొచ్చే పనిలో ఉన్నారు.
తాజాగా ఓ మీడియా ఇంటర్య్వూలో మాట్లాడిన వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవుడు, సమాజం, బంధాలు లాంటి ఏ విషయానికి తాను భయపడనని చెప్పే వర్మ తనకు భయం కలిగించే విషయమేంటో బయటపెట్టాడు. తనకు మంచానికే పరిమితమై మరో వ్యక్తి మీద ఆధారపడి జీవించటం అన్నా.. ముసలితనం అన్న భయమని తెలిపారు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా జనవరి 24న రిలీజ్ కానుంది.