సావిత్రిని శ్రీదేవిగా మార్చిన రామ్గోపాల్ వర్మ

5 Oct, 2014 14:20 IST|Sakshi
సావిత్రిని శ్రీదేవిగా మార్చిన రామ్గోపాల్ వర్మ


హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ నిర్మించనున్న 'సావిత్రి' సినిమా టైటిల్ను శ్రీదేవిగా మార్చారు. ఈ చిత్రం పోస్టర్ వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సావిత్రి అనే టైటిల్ను మరొకరు రిజిష్టర్ చేసుకోవడం వల్ల దీనిని మార్చవలసి వచ్చింది.

ప్రముఖ నటి శ్రీదేవి అంటే రామ్గోపాల్ వర్మకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. శ్రీదేవి-వెంకటేష్లతో నిర్మించిన 'క్షణం క్షణం'  గొప్ప విజయం కూడా సాధించింది. దాంతో వివాదాస్పద చిత్రానికి రాము శ్రీదేవి అని పేరు పెట్టారు.
**

>