బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

20 Jul, 2019 11:55 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తన సినిమాల విషయంలోనే కాదు తన శిష్యులు తెరకెక్కించిన సినిమాలకు కూడా కావాల్సినంత పబ్లిసిటీ చేసి పెడుతున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీపై వరుస ట్వీట్ చేస్తున్నాడు వర్మ. ఈరోజు వర్మ తన శిష్యులతో కూడా ఈ సినిమా చూడబోతున్నాడు.

‘ఆర్‌ఎక్స్‌ 100 ఫేం అజయ్‌ భూపతి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ఫేం అగస్త్య మంజులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల ఆట చూడటానికి ముసాపేట శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూడబోతున్నా. థియేటర్‌కు మాస్‌ గెటప్‌లో బైక్‌పై వెళ్లనున్నాం’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ శంకర్‌ మంచి వసూళ్లను రాబడుతూ దూకుపోతోంది.

పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. పీసీ కనెక్ట్స్‌, పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కు మణిశర్మ సంగీతమందించారు. బీ, సీ సెంటర్లలో దుమ్ము రేపుతున్న ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే రూ. 25 కోట్ల గ్రాస్‌ సాధించటం విశేషం.

మరిన్ని వార్తలు