వర్మ కొత్త కంపెనీ

26 Jul, 2018 14:43 IST|Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సంఛలనానికి తెర తీశాడు. ఇప్పటికే రక్తచరిత్ర, వీరప్పన్‌, వంగవీటి లాంటి చిత్రాలను తెరకెక్కించిన వర్మ మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. త్వరలో వర్మ బ్యానర్‌లో డి-కంపెనీ పేరుతో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించనున్నారు. 1980లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహిం కథతో ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నాడు వర్మ.

ఇప్పటికే సినిమా కోసం రిసెర్చ్‌ ప్రారంభించిన వర్మ 20 క్రితం జరిగిన సంఘటనల గురించి సమాచారాన్ని సేకరించారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని సినిమాగా కన్నా వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కిస్తేనే సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు వర్మ. ఈ వెబ్‌ సిరీస్‌ను బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి తానే స్వయంగా నిర్మిస్తున్నాడు వర్మ. అయితే వెబ్‌ సిరీస్‌ ఏ ఏ భాషల్లో రూపొందిస్తున్నారు. ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయాలను మాత్రం వర్మ వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు