మరో సినిమాను లైన్‌లో పెట్టిన రామ్‌

15 Feb, 2019 10:38 IST|Sakshi

టాలెంట్‌ ఉన్నా వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో రామ్‌. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్‌ సినిమాలో నటిస్తున్న రామ్‌, తదుపరి చిత్రాన్ని కూడా లైన్‌ పెట్టాడు. రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అయ్యారే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సాగర్‌ కె చంద్ర తరువాత నారా రోహిత్‌, శ్రీవిష్ణు కాంబినేషన్లో తెరకెక్కిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు.

అప్పట్లో ఒకడుండేవాడు సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న సాగర్‌ ప్రస్తుతం రామ్‌ కోసం ఓ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే రామ్‌ కు లైన్‌ వినిపించిన సాగర్, ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అనుకున్న సమయానికి కథ రెడీ అయితే ఇస్మార్ట్‌ శంకర్‌ తరువాత రామ్‌ చేయబోయే సినిమా ఇదే అవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాను రామ్ తన సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీ బ్యానర్‌లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు