రామ్చరణ్... మంచి మాస్ హీరో. బోయపాటి మంచి మాస్ డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబినేషన్లో మాస్ అమ్మా.. మాస్ అనేలా శుక్రవారం ఓ సినిమా మొదలైంది. డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్పై దానయ్య డీవీవీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. దానయ్య మాట్లాడుతూ– ‘‘రామ్చరణ్, బోయపాటి కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఓ అంచనా ఉంటుంది. ఆ అంచనాలకు దీటుగా ఈ సినిమాను రూపొందిస్తాం. బోయపాటి అద్భుతమైన కథతో చరణ్ను సరికొత్తగా చూపించనున్నారు. మేకింగ్లో కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో రూపొందిస్తాం. కియారా అద్వాని ఇందులో కథానాయిక.
తమిళ నటుడు ప్రశాంత్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుతాం. ఫిబ్రవరిలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్, కో–ప్రొడ్యూసర్: డి. కళ్యాణ్.