మెరుపులా మెరిసి..

21 Jan, 2018 00:52 IST|Sakshi

రానా కేవలం తెలుగు హీరోనే కాదు. టాలీవుడ్, బాలీవుడ్‌ అటు తమిళం కూడా కవర్‌ చేస్తూ బిజీగా ఉన్న నటుడు. కథ బావుంటే హీరో, విలన్‌ అని పట్టించుకోరు. సినిమాలో తన స్క్రీన్‌ టైమ్‌ ఎంత సేపు అని కూడా ఆలోచించరు. అతిథి పాత్రలో ఇలా కనిపించి అలా మాయమవుతుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ మెరుపులా మెరుస్తా అంటున్నారు రానా. చక్రి తోలేటి దర్శకత్వంలో సోనాక్షి సిన్హా, కరణ్‌ జోహార్, రితేష్‌ దేశ్‌ముఖ్, బొమన్‌ ఇరానీ ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వెల్కమ్‌ న్యూయార్క్‌’. ప్రస్తుతం రానా ‘మడై తిరందు’, ‘హాతీ మేరా సాథీ’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘వెల్కమ్‌ న్యూయార్క్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు