రానా, రవితేజల మల్టీ స్టారర్

26 Oct, 2017 13:10 IST|Sakshi

ఇటీవల కోలీవుడ్ లో ఘన విజయం సాధించిన సినిమా విక్రమ్ వేదా. విలక్షణ నటులు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక పాత్రకు రానాను ఫైనల్ చేయగా మరో పాత్రలో వెంకటేష్, నాగార్జునల పేర్లు వినిపించాయి.

అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. ఈ క్రేజీ రీమేక్ లో రానాతో పాటు రవితేజ నటించనున్నాడట. మాధవన్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా రానా, విజయ్ సేతుపతి నటించిన క్రిమినల్ పాత్రలో రవితేజ నటించే అవకాశం ఉంది. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రిలే తెలుగు వర్షన్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు