‘విరాటపర్వం’ మొదలైంది!

15 Jun, 2019 12:43 IST|Sakshi

‘నీదినాది ఒకే కథ’ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల తన రెండో సినిమాను ప్రారంభించాడు. మరోసారి ప్రయోగాత్మక శైలినే ఎంచుకున్న వేణు.. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా విరాటపర్వం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజు రామానాయుడు స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది.

ముహూర్తపు స‌న్నివేశానికి విక్టరీ వెంక‌టేశ్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే గొట్టిపాటి  ర‌వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ద‌ర్శకుడు వేణు ఊడుగుల‌కి స్క్రిప్ట్‌ను అందించారు. వ‌చ్చే వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత మందిస్తుండగా దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. 

సురేష్ ప్రొడ‌క్షన్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప‌తాకాల‌పై సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో విక్టరీ వెంక‌టేశ్‌, డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి, సాయిప‌ల్లవి, ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి, నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, మోహ‌న్ చెరుకూరి, వై. ర‌విశంక‌ర్‌, సాహు గార‌పాటి, అభిషేక్ అగ‌ర్వాల్‌, రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌, డైరెక్టర్స్ చందు మొండేటి, అజయ్ భూప‌తి, వెంక‌టేశ్ మ‌హా, ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు