మాస్ టచ్‌తో...

2 Feb, 2015 23:16 IST|Sakshi
మాస్ టచ్‌తో...

 ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘రణం’ ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు తెలిసిందే. ప్రస్తుతం ‘రణం-2’  పేరుతో ‘అమ్మ’ రాజశేఖర్ హీరోగా, ఆయన దర్శకత్వంలోనే ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ యాదవ్ నిర్మాత. నిధి కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘అన్ని వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నా పాత్ర మాస్ టచ్‌తో ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్రీధర్.