పిండి కొద్దీ రొట్టె

24 Jun, 2018 00:35 IST|Sakshi
రణ్‌బీర్‌ కపూర్‌

ఇండస్ట్రీలో మేల్‌ యాక్టర్స్‌తో పోలిస్తే మాకు తగినంత పారితోషికం ఇవ్వట్లేదంటూ ఇటీవల బాలీవుడ్‌లో పలువురు భామలు వాపోయారు. సినిమాలో కీలక పాత్రలు ఉన్నప్పటికీ పారితోషికంలో వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. పారితోషికాల విషయంలో స్త్రీ, పురుషులు అనే వ్యత్యాసం ఉందా? అని రణ్‌బీర్‌ కపూర్‌ని అడగ్గా –‘‘పిండి కొద్దీ రొట్టె.

జెండర్‌ని బట్టి పారితోషికం నిర్ణయిస్తారనుకోవటం పొరపాటు. ఎవరి మార్కెట్‌ ఎంతో అందరికీ ఒక అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి పే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సినిమాలు బాగా ఆడితేనే ఇస్తారు. లేదంటే లేదు. ఒకవేళ నెక్ట్స్‌ నేను దీపికా పదుకోన్‌తో యాక్ట్‌ చేస్తే తనకి, నాకు సమానంగా ఇవ్వొచ్చు లేదా తనకే ఇంకా ఎక్కువ ఇవ్వొచు’’ అని చెప్పుకొచ్చారు రణ్‌బీర్‌.

మరిన్ని వార్తలు