ముహూర్తం మారింది..!!

1 Jul, 2018 15:28 IST|Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దీపికా–రణ్‌వీర్‌ల పెళ్లి ముహూర్తం మారినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ 12 నుంచి 16 మధ్య ఈ ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారని రిపోర్టులు వస్తున్నాయి. గతంలో నవంబర్‌ 10న వీరి వివాహం జరగనున్నట్లు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.

ఇటలీలో వివాహం జరగనున్నట్లు సమాచారం. ఆల్రెడీ జనవరిలో దీపికా బర్త్‌డే అప్పుడు మాల్దీవ్స్‌లో ఎవరికీ తెలియకుండా దీపికా, రణ్‌వీర్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని వార్తలు కూడా వినిపించాయి. కేవలం కుటుంబ సభ్యులు, మిత్రుల మధ్య  వివాహం చేసుకున్నాక ఇండస్ట్రీ వాళ్ల కోసం బెంగళూర్‌లో వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారని టాక్‌.

పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ కూడా ఆల్రెడీ మొదలెట్టారట. రెండు కుటుంబాలూ మెహందీ, సంగీత్‌.. అంటూ పెళ్లికి సంబంధించిన వేడుకలను ఘనంగా ప్లాన్‌ చేస్తున్నారట.

మరిన్ని వార్తలు