ఈ బాలీవుడ్‌ జంట ఏది చేసినా ప్రత్యేకమే!

3 Jan, 2020 12:12 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణవీర్ సింగ్‌, దీపికా పదుకునే ఏది చేసినా ప్రత్యేకమే. తాజాగా వీరి గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని వేరు వేరు ఫ్లాట్లలో ఈ జంట ఉంటున్నట్లు సమాచారం. అయితే దీపికా తన సొంత ఫ్లాటలోనూ.. రణవీర్‌ అద్దె ఫ్లాట్‌లోనూ నివాసం ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. 2010లో దీపికా ముంబైలోని ప్రభాదేవి అపార్ట్‌మెంటులో ఓ ఫ్లాట్‌లను కొనుగోలు చేసింది. తాజాగా అదే అపార్ట్‌మెంట్‌లోని ఓ 4బీహెచ్‌కే ఫ్లాట్‌లో రణవీర్‌ అద్దెకు దిగాడు. నెలకు దాదాపు 7.25 లక్షల రూపాయల చొప్పున రెండేళ్ల అద్దెను ముందుగానే చెల్లించాడు. ఆ తర్వాత సంవత్సరానికి నెలకు రూ. 7.97లక్షల అద్దెను చెల్లించనున్నాడు. మొత్తానికి మూడు సంవత్సరాల పాటు రణవీర్‌ అక్కడే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఒకే అపార్ట్‌మెంట్‌లో భార్యాభర్తలు ఇలా విడివిడిగా వేర్వేరు ఫ్లాట్‌లలో ఉండడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ జంట పెళ‍్లయిన తర్వాత వివిధ ఫంక్షన్లకు హాజరై అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం దీపిక తను నటించిన ఛపాక్‌ సినిమా ప్రమోషన్లో బిజీగా బిజీగా ఉండగా, రణ్‌వీర్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. కాగా, గాఢమైన ప్రేమాయణం తర్వాత 2018సంవత్సరం ఇటలీలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు