మూడో భామ ఎవరు?

9 Oct, 2018 04:37 IST|Sakshi
రాశీఖన్నా, విజయ్‌ దేవరకొండ, ఐశ్వర్యా రాజేశ్‌

అటు సినిమాలు వరుసగా ఒప్పేసుకుంటూ ఇటు వరుసగా సినిమాలను రిలీజ్‌ చేస్తూ మస్త్‌ క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్నారు విజయ్‌ దేవరకొండ. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ ఫేమ్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరా సందర్భంగా ఈ నెల 18 న ప్రారంభం కానుంది. క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌పై కేయస్‌ రామారావు నిర్మించనున్న ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్‌ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్‌ కూడా ఉంటారని సమాచారం. అందులో ఒకరు ఇటీవలే ‘నవాబ్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఐశ్వర్యా రాజేశ్‌ అట. మరి మూడో హీరోయిన్‌ ఎవరో తెలియాల్సి ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తోంది చిత్రబృందం.

మరిన్ని వార్తలు