‘నేను అనసూయ గార్డియన్‌ను కాదు’

7 Feb, 2018 17:29 IST|Sakshi

స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్‌ ఓ బాలుడి చేతిలో ఫోన్‌ పగలగొట్టిందని, దుర్బాషలాడిందని బాధిత బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఓ నెటిజన్‌ రష్మికి ట్వీట్‌ చేశాడు. ‘అనసూయకు పబ్లిక్‌తో ఎలా ఉండాలో చెప్పండి నేర్చుకుంటుంద’ని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీనికి సమాధానంగా.. ‘నేను ఆమె గార్డియన్‌ను కాదు’ అని ట్వీట్‌ రష్మి చేసింది. అంతేకాక ఆమె నిజ జీవితంలో జరిగిన ఒక విషయాన్ని వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించింది.

‘మీతో నేను ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. నేను షూటింగ్‌ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బైక్‌లపై  నలుగురు యువకులు మా కారును ఫాలో అయ్యారు. వారిని తప్పించడానికి మా డ్రైవర్‌ ప్రయత్నించాడు. వారు అలానే వెంబడించారు. చివరికి నేను కారును ఆపించాను. ఆ యువకులు మాకు సెల్ఫీ ఇస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని గట్టిగా అడిగారు. మా టైం బాగుండి అదే సమయంలో అటువైపుగా పెట్రోలింగ్‌ వ్యాన్‌ వచ్చింది. పోలీసులు మాకు హెల్ఫ్‌ చేశారు.  ఆ యువకులను పోలీసులకు అప్పగించాను. వారి లైఫ్‌ను నాశనం చేయాలని నేను అనుకోలేద’ అని వెల్లడించింది.

మరిన్ని వార్తలు