వినోదం పక్కా

19 Sep, 2016 23:30 IST|Sakshi
వినోదం పక్కా

 వినోదమే ప్రధానంగా తెరకెక్కిన చిత్రం ‘తను..వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మీ గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో వెంకట్ కాచర్ల దర్శకత్వంలో శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మించారు. రవిచంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రం లోగోను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, పాటల సీడీని నిర్మాతలు బీఏ రాజు, కె.రాఘవేంద్రరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ శీను ఆవిష్కరించారు. అనంతరం చిత్ర దర్శకుడు మాట్లాడుతూ -
 
 ‘‘ఇటీవల ప్రేమకథలు, హారర్, కామెడీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకులకు నవ్వులు పంచాలనే ఉద్దేశంతో వినోదమే ప్రధానంగా ఈ చిత్రం నిర్మించాం. ఇందులో పలు ట్విస్ట్‌లు ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘ఇప్పటికే మా చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. రాఘవేంద్రరెడ్డిగారు మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ నెలాఖరులో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు. తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, సహ నిర్మాత యశ్వంత్, పాటల రచయిత్రి డా. చల్లా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.