భయపెట్టడానికి రెడీ అవుతున్న రష్మీ

1 Mar, 2016 17:37 IST|Sakshi
భయపెట్టడానికి రెడీ అవుతున్న రష్మీ

బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మి ఇప్పుడు వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే పలుచిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్గా సక్సెస్ కొట్టాలని భావిస్తోంది. జాతీయ అవార్డ్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

అదే జోష్లో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. తెలుగుతెర మీద ఇంత వరకు నేరుగా రాని జాంబి తరహా కథాకథనాలతో తెరకెక్కనున్న కామెడీ ఎంటర్టైనర్లో రష్మి లీడ్ రోల్లో కనిపించనుంది. జాంబీ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'తను వచ్చెనంట' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

రష్మితో పాటు తేజ కాకుమాను, ధన్యా బాలకృష్ణన్, చలాకీ చంటి ఇతర ప్రదాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు బుల్లితెర మీద, వెండితెర మీద తన గ్లామర్తో, మంచి టైమింగ్తో నవ్వించిన రష్మి ఇప్పుడు ఈ హర్రర్ సినిమాతో ఎంత వరకు భయపెడుతుందో చూడాలి.