జోడీ ఎవరు?

24 Feb, 2020 05:37 IST|Sakshi
రష్మికా మందన్నా

ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇది. నాగవంశీ, కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు? అనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు చిత్రబృందం. ‘అరవింద..’లో నటించిన పూజా హెగ్డే మళ్లీ హీరోయిన్‌గా కనిపిస్తారని వినిపించింది. తాజాగా రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్నారని సమాచారం. మరి ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారా? అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.. మేలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు