బంపర్‌ ఆఫర్‌

26 Jun, 2020 06:27 IST|Sakshi

‘హీ ఈజ్‌ సో క్యూట్‌..’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్‌బాబుని వెంటాడి వెంటాడి ప్రేమిస్తుంది రష్మికా మందన్నా. రియల్‌ లైఫ్‌లో మాత్రం ‘షీ ఈజ్‌ సో క్యూట్‌’ అంటూ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ జాబితాలోకి చేరిపోయిన రష్మికా మందన్నా ఇప్పుడు తమిళ తెరపై కూడా కనిపించబోతున్నారు. కార్తీ సరసన ‘సుల్తాన్‌’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా విడుదల కాకముందే తమిళంలో ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారని టాక్‌. కోలీవుడ్‌లో తిరుగులేని మాస్‌ హీరో అనిపించుకున్న విజయ్‌ 65వ సినిమాలో రష్మికా మందన్నా కథానాయికగా నటించనున్నారట. పూజా హెగ్డే, కీర్తీ సురేష్‌.. ఇలా పలువురి తారల పేర్లు వినిపించినా ఫైనల్లీ ఈ అవకాశం రష్మికాని వరించిందని కోలీవుడ్‌ టాక్‌.

మరిన్ని వార్తలు