జోడీ కుదిరింది

12 May, 2019 03:08 IST|Sakshi
మహేశ్‌బాబు, రష్మికా మండన్నా

కెరీర్‌లో తన 25వ సినిమా ‘మహర్షి’తో మంచి విజయాన్ని అందుకున్నారు మహేశ్‌బాబు. ఇక తన తర్వాతి సినిమాపై దృష్టిపెట్టారు. ‘ఎఫ్‌ 2’ ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ సుంకర ఓ సినిమా నిర్మిస్తారని తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే, రష్మికా మండన్నా పేర్లు మేజర్‌గా వినిపించాయి. అయితే ఇందులో రష్మికా మండన్నా ఫైనలైజ్‌ అయినట్లు తాజా సమాచారం.

దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. జూన్‌ సెకండ్‌ వీక్‌ నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుందని తెలిసింది. ఎక్కువగా వినోదాత్మకంగా సాగే ఈ సినిమా షూటింగ్‌ కోసం అనిల్‌ రావిపూడి  కర్నూలు పరిసర ప్రాంతాల్లో లొకేషన్స్‌ను వెతికిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో విజయశాంతి, బండ్ల గణేశ్‌ కీలక పాత్రలు చేయనున్నారని, ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు