కొత్తవారితో..

17 Sep, 2019 02:37 IST|Sakshi

పూల సిద్ధేశ్వరరావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రథేరా’. జాకట్‌ రమేష్‌ దర్శకత్వంలో వైఎస్‌ కృష్ణమూర్తి, నరేష్‌ యాదవ్, పూల సిద్ధేశ్వరరావు నిర్మించారు. సెన్సార్‌ నుంచి యు సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా గురించి జాకట్‌ రమేష్‌ మాట్లాడుతూ– ‘‘వీవీ వినాయక్‌గారు విడుదల చేసిన మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. మంచి కంటెంట్‌తో తెరకెక్కించిన చిత్రం ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. అందరూ కొత్తవారికే ప్రాధాన్యం ఇచ్చాం. సంగీతంతో పాటు రీరికార్డింగ్‌కి మంచి ప్రశంసలు వస్తున్నాయి’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు నిర్మాతలు.

మరిన్ని వార్తలు