‘సినిమా మే 8న.. టీజర్‌ కమింగ్‌ సూన్‌’

13 Feb, 2020 16:38 IST|Sakshi

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా, గ్లామరస్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘క్రాక్‌’. గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్‌ డివిజన్‌ బ్యానర్‌పై ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌తో పాటు మరో పోస్టర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవితేజ డార్క్‌ షాడోగా పరిగెత్తుకుంటూ వస్తున్న ఈ పోస్టర్‌ ఓ యాక్షన్‌ సీన్‌కు సంబంధించిందిగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్ర టీజర్‌ త్వరలోనే విడుదల చేయబోతున్నామని, అదేవిధంగా చిత్రాన్ని వేసవి కానుకగా మే8న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.    

ఇక ‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘క్రాక్‌’ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన డాన్‌ శీను నిరాశపరచగా.. బలుపు సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించింది. ఇక బలుపు తర్వాత రవితేజతో శృతిహాసన్‌ జతకడుతోంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘డిస్కో రాజా’ బాక్సాపీస్‌ వద్ద ఘోరంగా బోల్తాపడింది. దీంతో రవితేజ ‘క్రాక్‌’ చిత్రంపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి రవితేజకు గోపిచంద్‌ మలినేని ఈ చిత్రంతో విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్‌ జాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ
దర్శకురాలిగా ‘లక్ష్మీ సౌజన్య’


మరిన్ని వార్తలు