‘మనిషిలా మళ్లీ మళ్లీ చెప్పించుకుంటావా?’

12 Sep, 2018 12:55 IST|Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ రవిబాబు దర్శకత్వంలో పందిపిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అదుగో. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి రవిబాబు స‍్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ఇతర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్‌ అవుతున్న ఈ మూవీ అఫీషియల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ ట్రైలర్‌లో సినిమాలో ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. అలాగే బంటీ (పందిపిల్ల) చేసే సాహసాలు, కామెడీని కూడా చూపించారు. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో అదుగో పేరుతో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాలో ఇతర భారతీయ భాషలన్నింటిలో బంటీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు