సమ్మర్‌లో క్రాక్‌

27 Jan, 2020 06:55 IST|Sakshi

రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ‘డాన్‌ శీను, బలుపు’ తర్వాత వస్తున్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు రవితేజ. బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ కథానాయిక. మే 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి.

మరిన్ని వార్తలు