ఎన్టీఆర్‌ అందుకే రాలేదు..!

8 May, 2018 12:02 IST|Sakshi

కొంతకాలంగా నందమూరి హీరోలు ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్‌లు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరి సినిమా వేడుకల్లో మరొకరు పాల్గొంటూ వస్తున్నారు. దీంతో ఏ ఒక్క వేడుకలో ఈ ఇద్దరు కలిసి కనిపించకపోయినా అది టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఇటీవల కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ఎమ్మెల్యే ఆడియో ఫంక్షన్‌కు ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తరువాత కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా ఓపెనింగ్‌లో ఇద్దరు కలిసి కనిపించటంతో రూమర్లకు చెక్‌ పడింది.

తాజాగా కల్యాణ్ రామ్‌ హీరోగా తెరకెక్కిన నా నువ్వే సినిమా ఆడియో వేడుకకు కూడా ఎన్టీఆర్‌ హాజరు కాలేదు. దీంతో మరోసారి రూమర్లకు ఛాన్స్‌ ఇవ్వకూడదని భావించిన ఎన్టీఆర్‌ టీం వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైజాగ్‌లో హరికృష్ణ సన్నిహితుల పెళ్లి వేడుకకు హాజరు కావాల్సి ఉండటంతో ఎన్టీఆర్‌ ‘నా నువ్వే’ ఆడియో వేడుకకు హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు