ఇంకా రెండు రోజులే!

29 Apr, 2014 22:17 IST|Sakshi
ఇంకా రెండు రోజులే!

నాగార్జున తొలిసారిగా చేస్తున్న బుల్లితెర షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. మా టీవీలో జూన్ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ షోలో పాల్గొనే వారి ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. రోజుకో ప్రశ్న చొప్పున మా టీవీలో ఐదు రోజులుగా ప్రశ్నలు వేస్తున్నారు. మరో రెండు రోజుల్లో రెండు ప్రశ్నలతో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మే 1 రాత్రి 7 గంటల్లోపు ఈ ప్రశ్నలకు ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాధానాలు పంపాలని, కోటి రూపాయలు బహుమానం అందించే ఈ షోలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని మా టీవీ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.