కోర్టులో శ్వేతా బసుకు ఊరట!

29 Oct, 2014 16:39 IST|Sakshi
కోర్టులో శ్వేతా బసుకు ఊరట!
హైదరాబాద్: సినీ నటి శ్వేతా బసు ప్రసాద్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పునరావాస కేంద్ర నుంచి శ్వేతా బసును వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. శ్వేతాబసును విడుదల చేయాలంటూ కొద్ది రోజుల క్రితం ఆమె తల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
 
శ్వేతా బసు తల్లి దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం నాంపల్లి కోర్టు విచారించింది. ఓ కేసులో ఓ హెటల్ లో శ్వేతాబసును అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆమె పునరావాస కేంద్రంలో ఉంటున్నారు.