ఏడడుగులకు రెడీ

17 Jan, 2019 00:31 IST|Sakshi

సగం పెళ్లి చేసుకున్నారు కథానాయిక రిచా గంగోపాధ్యాయ్‌. అదేనండీ ఆమె నిశ్చితార్థం జరిగిందని సరదాగా అలా చెబుతున్నాం. ఈ విషయాన్ని రిచా అధికారికంగా వెల్లడించారు. ‘‘నా నిశ్చితార్థం పూర్తయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నా కాబోయే భర్త జోను నేను ఓ బిజినెస్‌ స్కూల్‌లో కలుసుకున్నాను. రెండేళ్లు అద్భుతంగా గడిచాయి. నా జీవితంలో నెక్ట్స్‌ ఫేజ్‌(పెళ్లి తర్వాతి జీవితం) గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పెళ్లి తేదీ నిర్ణయించలేదు’’ అని పేర్కొన్నారు రిచా. ‘లీడర్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రిచా ఆ తర్వాత ‘నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి’ వంటి సినిమాల్లో నటించారు. 2013లో ‘భాయ్‌’ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ‘ఇక సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నా’ అని ప్రకటించి ఆమె అమెరికా వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు