‘రిషిని చివరి సారి తెరపై చూసే అవకాశం’

3 May, 2020 17:10 IST|Sakshi

‘శర్మాజీ నమ్‌కీన్’ పూర్తి చేస్తాం: నిర్మాతలు

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రిషి కపూర్‌ లేరనే వార్తను ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్న ఆయన అభిమానులకు నిర్మాతలు రితేష్‌ సిధ్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌లు కాస్త స్వాంతన కలిగించే వార్త తెలిపారు. షూటింగ్‌ తుది దశలో ఉన్న రిషి కపూర్‌ చివరి చిత్రం ‘శర్మాజీ నమ్‌కీన్‌’ మిగిలిన షూటింగ్‌ పూర్తిచేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని రిషి కపూర్‌కు అంకితమివ్వాలని నిర్మాతలు భావిస్తున్నారు.  ఒకవేళ ఇదే నిజమైతే.. రిషి కపూర్‌ను చివరిసారిగా తెరపై చూసే అవకాశం అందరికీ లభించనుంది. 

‘మరో రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొంటే ఈ చిత్రం పూర్తయ్యేదని కాని అప్పటికే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఆయన అకాల మరణం మమ్మల్ని ఎంతగా కలచివేసింది. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేసి ఆయనకు అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాం. అయితే ఆయన లేకుండా ‘శర్మాజీ నమ్‌కీన్‌’ ఎలా పూర్తి చేస్తారో తెలుసుకోవాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే’అని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. రిషి కపూర్‌, జూహీ చావ్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హితేష్‌ భాటియా దర్శకత్వం వహిస్తున్నారు.  

చదవండి:
వైర‌ల‌వుతున్న రిషి కపూర్ వీడియో
నా జీవితంలోకి ప్రేమను తెచ్చారు

మరిన్ని వార్తలు