మధుబాల రీఎంట్రీ

27 Jun, 2013 11:09 IST|Sakshi
మధుబాల పునరాగమనం

 ‘రోజా’ ఫేం మధుబాల కొంత గ్యాప్తర్వాత తెలుగులో ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంలో నటిసున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ తెరపై ఆమె కనిపించి దాదాపు పదిహేనేళ్లయ్యింది. అందుకని ఆమె రీ-ఎంట్రీ చాలామందిని ఆనందపరుస్తోంది. ఇన్నాళ్లూ దక్షిణాది చిత్రాలకు దూరంగా ఉన్న మధుబాల తెలుగుతో పాటు ఇటీవల ఓ తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. లేడీ డెరైక్టర్ లక్ష్మీ రామకృష్ణన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఓ యువకుడి జీవితంలో జరిగే అడ్డదిడ్డమైన సంఘటనలు ఇతరులకు ఏ విధంగా లాభపడ్డాయి? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

ఆ యువకుడు ఒకానొక పరిస్థితిలో ప్రేయసిని లేక తన జీవితంలో ఉన్న సెలబ్రిటీల్లో ఎవరో ఒకరి పక్షాన నిలబడాల్సిన పరిస్థితిలో పడతాడు? అనంతరం ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన మలుపుతో ఈ చిత్రం సాగుతుందట. ఇందులో సెలబ్రిటీ పాత్రను మధుబాలతో చేయించాలనుకున్నారట లక్ష్మి. ఈ కథ, తన పాత్ర వినగానే మధు ఎగ్జయిట్ అయ్యారని, వెంటనే పచ్చజెండా ఊపారని సమాచారం. ఇందులో ఆమె మ్యుజీషియన్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర బాగా నచ్చడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్స్ కేటాయిస్తానని మాటిచ్చారట మదుభాల